ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా పాజిటివ్

ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా పాజిటివ్

లోక్ సభ ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తాను కరోనా బారినపడ్డానని.. డాక్టర్ల సూచనమేరకు హోంక్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ‘కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ రోజు పరీక్షలు చేయించుకున్నాను. డాక్టర్లు నాకు కరోనా సోకినట్లు తేల్చారు. వైద్యుల సూచన మేరకు గృహ నిర్బంధంలో ఉన్నాను. ఇటీవల నాతో తిరిగిన వాళ్లందరూ స్వచ్ఛందంగా క్వారంటైన్ లో ఉండాలని కోరుతున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. కార్తీ చిదంబరం ప్రస్తుతం తమిళనాడులోని శివగంగ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తమిళనాడులో ప్రస్తుతం 56,998 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ కరోనా బారినపడి 4,132 మంది చనిపోయారు. అక్కడ ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,57,613గా ఉంది. వారిలో 1,96,483 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

For More News..

చెల్లి కోరిక మేరకు రాఖీ రోజు పోలీసులకు లొంగిపోయిన నక్సల్ అన్న

వీడియో: కేటీఆర్ కు రాఖీ కట్టిన సోదరి కవిత

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు కరోన.. ఆయనతో మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్