ఎర్రవల్లి ఫాంహౌస్​ రోడ్డు కోసమే  బుదగరిస్తుండు

ఎర్రవల్లి ఫాంహౌస్​ రోడ్డు కోసమే  బుదగరిస్తుండు

నల్గొండ, వెలుగు: సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్​కు వెళ్లే రోడ్డును వేయకుండా అడ్డుకున్నందుకే వాసాలమ‌‌ర్రి ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. ‘ఎర్రవల్లి ఫాంహౌస్​కు రోడ్డు కోసం వాసాలమ‌‌ర్రి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నవు. వాసాలమ‌‌ర్రిని సొంత డ‌‌బ్బులు పెట్టి అభివృద్ధి చేస్తున్నవా?’ అని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. స‌‌ర్కార్ నిధుల‌‌తో చేప‌‌డుతుంటే ఆ ప్రాంత ఎంపీనైన తనకు ఎందుకు ఆహ్వానం పంపలేదని నిలదీశారు. సూర్యా పేట‌‌లో మంత్రి కేటీఆర్​.. కర్నల్ సంతోష్​ బాబు విగ్రహావిష్కరణకూ తనకు ఆహ్వానం లేదన్నారు. ప్రతిపక్ష   ప్రజా ప్రతినిధులను పిలవాలనే సంస్కారం లేని వ్యక్తి సీఎం అవ‌‌డం మ‌‌న దౌర్భాగ్యమ‌‌న్నారు.