కేసీఆర్ నిర్ణయాలు పిచ్చి తుగ్లక్ చర్యలను తలపిస్తున్నాయి

కేసీఆర్ నిర్ణయాలు పిచ్చి తుగ్లక్ చర్యలను తలపిస్తున్నాయి

కేసీఆర్ నిర్ణయాలు పిచ్చి తుగ్లక్ చర్యలను తలపిస్తున్నాయన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మూడు నెలల నుండి రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. కొత్త విధానం రిజిస్ట్రేషన్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..తక్షణమే పాత విధానం ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రజలకు గుదిబండలాగా మరిందని..తక్షమే రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున్న  ప్రజా ఉద్యమం చేస్తామన్నారు. ప్రగతిభవన్ గడీలను బద్దలు కొడుతామన్న వెంకట్ రెడ్డి..ఇకనైనా కేసీఆర్ ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనగగించాలన్నారు. లేకపోతే కేసీఆర్ కు భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.