సర్పంచ్ కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయం

సర్పంచ్ కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి: కారు ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం వెల్లంకి చెరువులో జరిగిన కారు ప్రమాదంలో… సర్నేనిగూడెం సర్పంచ్ భర్త ధర్నే మధు, కొడుకు మణికంఠ, సాగుబాయి గూడెంకి చెందిన శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించి ఇరు కుటుంబాలకు అండగా ఉంటానని హామీఇచ్చారు. ఖర్చుల నిమిత్తం సర్పంచ్ కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయాన్ని చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన… ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. సర్పంచ్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్ధిక సహాయం సీఎం కేసీఆర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తనవంతుగా కుటుంబాన్ని అదుకుంటామని, అమ్మాయి చదువుకు ఎంత ఖర్చైన భరించి చదివిస్తామని తెలిపారు.