మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కోమటిరెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పీసీసీ కమిటీలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

ఈ నెల 10వ తేదీన ఎఐసీసీ టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. ఈ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. అలాగే టీపీసీసీ కమిటీల నియామకంలో కొందరు సీనియర్లకు చోటు దక్కని విషయాన్ని వెంకట్ రెడ్డి ఖర్గేకు వివరించారని సమాచారం. కమిటీల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఖర్గేతో వెంకట్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.