తంగళ్లపల్లి గోవర్థనమ్మకు శ్రద్ధాంజలి తెలిపిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా, వీరవెల్లి వెలుగు : మండలంలో పర్యటించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలు సేవా కార్యక్రమాల్లో పాల్లొన్నారు. ఇటీవల చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ క్రమంలోనే వీరవెల్లి సర్పంచ్ కల్పనా శ్రీనివాసచారి ఫ్యామిలీని పరామర్శించారు ఎంపీ కోమటిరెడ్డి. వీరవెల్లి మాజీ సర్పంచ్(ప్రస్తుత సర్పంచ్ కల్పన భర్త) శ్రీనివాసచారి తల్లి తంగళ్లపల్లి గోవర్ధనమ్మ(85) అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే శనివారం వీరవెల్లికి వెల్లి సర్పంచ్ ఫ్యామిలీని పరామర్శించి ధైర్యం చెప్పారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అలాగే ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన ఆత్మకూరు మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వార్డు మెంబర్ కడకంచి మల్లేష్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఎంపీ.. వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 50 వేలు ఆర్ధిక సాయం చేశారు.మల్లేష్ కూతురి వివాహానికి రూ. లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు.