భారతీయుల ఐక్యతతోనే దేశ భవిష్యత్ : ఎంపీ మొకారియా రాంబాయ్

భారతీయుల ఐక్యతతోనే దేశ భవిష్యత్ : ఎంపీ మొకారియా రాంబాయ్
  • ఎంపీ మొకారియా రాంబాయ్​        

కామారెడ్డిటౌన్, వెలుగు : భారతీయుల ఐక్యతతోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని గుజరాత్​కు చెందిన రాజ్యసభ ఎంపీ మొకారియా రాంబాయ్​ పేర్కొన్నారు. మంగళవారం సర్ధార్ వల్లబాయ్​ పటేల్​ 150వ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఐక్యత పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు.  

విభిన్న రాజ్యాలుగా ఉన్న భారత దేశానికి ఒక్కటి చేసిన మహనీయుడు సర్ధార్​ వల్లబాయ్​ పటేల్ అన్నారు.  అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, డీఈవో రాజు, మున్సిపల్ కమిషనర్​ రాజేందర్​రెడ్డి, తహసీల్దార్ జనార్దన్,  జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్​గౌడ్ తదితరులు పాల్గొన్నారు.