కొత్తగా 150 గురుకులాలను మంజూరు చేయండి..మంత్రి పొన్నంను కోరిన ఎంపీ ఆర్.కృష్ణయ్య  

కొత్తగా 150 గురుకులాలను మంజూరు చేయండి..మంత్రి పొన్నంను కోరిన ఎంపీ ఆర్.కృష్ణయ్య  

ముషీరాబాద్, వెలుగు: బీసీల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల సబ్సిడీ రుణం ఇవ్వాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. బీసీ ప్రతినిధుల బృందం మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు.

120 బీసీ కాలేజీ హాస్టళ్లు, కొత్తగా 150 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​లో 20, రంగారెడ్డిలో 10, మేడ్చల్ లో 10, మహబూబ్ నగర్ జిల్లాలో 15, నల్గొండలో 15, వరంగల్ లో 10, నిజామాబాద్​లో 10, కరీంనగర్​లో 10, ఖమ్మంలో 10, ఆదిలాబాద్​లో 10 చొప్పున కొత్త హాస్టళ్లు మంజూరు చేయాలన్నారు.