బీజేపీలో సీఎం కేసీఆర్ కు అనుకూలమైన వర్గం ఉంది

బీజేపీలో సీఎం కేసీఆర్ కు అనుకూలమైన వర్గం ఉంది

బీజేపీలో రెండు వర్గాలున్నాయన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి..అందులో సీఎం కేసీఆర్ కు అనుకూలమైన వర్గం వుందన్నారు. అందుకే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయన్నారు. కానీ.. ప్రజాప్రతి నిధులకు, పబ్లిక్ కు తెరుచుకోవని తెలిపారు. మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్నారు. రామచందర్ రావు ను బలిపశువును చేసే కుట్ర జరుగుతుందన్నారు. బీజేపీ , టీఆర్ఎస్ కుమ్మకై లింగోజి గూడలో..పోటీ చేయడం లేదన్నారు.

మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ కలిసి జల్ పల్లి లో ఏకగ్రీవం చేసి..MIM కు సపోర్ట్ చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. వార్డు నెంబర్ 26 నల్గొండ కార్పొరేషన్ లో దుబ్బాక కాంతమ్మ చనిపోతే..బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపారన్నారు. చివరికి  MIM కూడా పోటీ చేస్తోందన్నారు. తెలంగాణ లో ఓ మంచి సంప్రదాయం తేవాలని టీఆర్ఎస్ అనుకోవడం మంచిదే. కానీ నల్గొండలో.. మా కాంగ్రెస్ అభ్యర్థి చనిపోతే.. ఎలా పోటీ లో పెడతారని ప్రశ్నించారు. దళిత మహిళా చనిపోయిన పట్టించుకోకుండా పోటీ చేస్తున్నారని తెలిపారు. విచారణ కమిటీ వేసి..రామచందర్ రావును ఆగం చేసే కుట్ర జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి వెళ్లమంటేనే రామచందర్ రావు ప్రగతి భవన్ కు వెళ్ళారన్నారు. బీజేపీలో అంతర్గత పోరు తీవ్రంగా వుందన్నారు. బండి సంజయ్ ని ప్రెసిడెంట్ పదవి నుండి తొలగించాలని కిషన్ రెడ్డి..కిషన్ రెడ్డి ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని బండి సంజయ్ ట్రై చేస్తున్నారని తెలిపారు రేవంత్.