న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ కమిటీలో ఎంపీలు బండి సంజయ్, రంజిత్ రెడ్డిలకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ చోటు కల్పించింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం పథకం కింద మోడీ సర్కారు ప్రవేశపెట్టిన 15 ప్రధాన కార్యక్రమాలు మైనార్టీలకు అందించే క్రమంలో ఎంపీలను అందులో భాగస్వాములను చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై జరిగే కమిటీ సమావేశాలకు ఈ ఎంపీలను ఆహ్వానించాలని, వారి విలువైన సూచనలు తీసుకుంటూ మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మైనారిటీ సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలను తెలంగాణలో పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పక్కదారి పడుతున్న మైనారిటీ సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు దక్కేలా కృషి చేస్తానని సంజయ్ తెలిపారు.
మైనారిటీ సంక్షేమ కమిటీలో ఎంపీ సంజయ్
- తెలంగాణం
- August 20, 2019
లేటెస్ట్
- ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత
- వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
- కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మారెడ్డి మృతి
- కొమురవెల్లిలో భక్తుల సందడి
- సల్లంగ సూడమ్మ పోచమ్మ తల్లి
- బీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
- సివిల్స్ ర్యాంకర్ కు సన్మానం
- అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ సర్కార్ : చింతకుంట విజయ రమణారావు
- మాజీ ఎమ్మెల్యే రసమయికి మతి చలించింది : ఒగ్గు దామోదర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..