రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చిన ధోనీ.. 2024 ఐపీఎల్ ఆడతాడా..?

రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చిన ధోనీ.. 2024 ఐపీఎల్ ఆడతాడా..?

టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ఎంత ఫాలోయింగ్ ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన చెక్కు చెదరని క్రేజ్ మహీ సొంతం. ఇటీవలే జరిగిన ఐపీఎల్ దీనికి నిదర్శనం. ఐపీఎల్ 2023 లో ధోనీ కోసం ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఒక్క చెన్నైలోనే కాదు మహేంద్రుడు ఎక్కడ అడుగుపెట్టిన అభిమానులు ధోనీ జపం పాటించారు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కాకూడదని ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. 

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది తర్వాత ధోనీ ఐపీఎల్ కి గుడ్ బై చెప్పకున్న 2024 ఐపీఎల్ ఆడతాడా లేదా అనుమానం ఫ్యాన్స్ లో నెలకొంది. దీనికి తోడు ఇటీవలే మాహీ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఐపీఎల్ ఆడటం కష్టమే అని భావించారు. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ధోనీ 2024 ఐపీఎల్ ఆడటం లో హింట్ ఇచ్చేసాడు. 

ఈ ఇంటర్వ్యూలో ధోనీ రిటైర్మెంట్ అవుతున్నారా అని హోస్ట్ ఒక ప్రశ్న వేసాడు. ఈ ప్రశ్నకు పక్కనే ఉన్న వ్యక్తి ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించాడు కానీ ఐపీఎల్ కి కాదని బదులిచ్చాడు.  ఇంతలో అభిమానులు ధోనీని  ప్రోత్సహించడంతో నవ్వుతూ ధోనీ "అవును" అని అంగీకరించాడు. చిరునవ్వుతో ప్రేక్షకుల వైపు సంకేతాలు ఇచ్చి ఐపీఎల్ 2024 కి నేను రెడీ అని ఫ్యాన్స్ కు చెప్పకనే చెప్పాడు. 

Also Read :- 2036లో ఒలింపిక్స్ కు ఇండియా రెడీ

కాగా.. ధోనీ మోకాలి గాయం సర్జరీ విజయవంతమైంది. అతను ఫాస్ట్ గా కోలుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు. దీంతో అభిమానుల కోసం ధోనీ ఐపీఎల్ 2024 ఆడటం దాదాపుగా ఖాయమైంది. మరి ఆ తర్వాత ధోనీ ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ధోనీ నాయకత్వంలో చెన్నైసూపర్ కింగ్స్ 5 ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ధోనీ 2024 ఐపీఎల్ లో మరోసారి చెన్నైను విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.