అంబానీ ఫ్యామిలీకి బెదిరింపులు.. విచారిస్తున్న పోలీసులు

అంబానీ ఫ్యామిలీకి బెదిరింపులు.. విచారిస్తున్న పోలీసులు

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న ఓ ఎస్‌‌యూవీని పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో పోలీసులు విచారణ చేపట్టగా.. అంబానీ కుటుంబాన్ని బెదిరించేందుకు ఇలా చేశారని, ఇందులో రెండు వెహికిల్స్‌‌ను వాడారని తేలింది. ఆ వాహనాల్లో నుంచి 20 గెలాటిన్ స్టిక్స్‌‌తోపాటు కొన్ని నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని నంబర్ ప్లేట్లు అంబానీ ఫ్యామిటీ సెక్యూరిటీ టీమ్‌‌ వాడిన నంబర్ ప్లేట్లను పోలి ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసును లోతుగా విచారించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్‌‌ను ముంబై పోలీసులు రంగంలోకి దింపారు. వందలాది సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారని, అలాగే 15 మంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.