ఏటూరునాగారం అడవుల్లో మావోయిస్టుల డంప్

ఏటూరునాగారం అడవుల్లో మావోయిస్టుల డంప్

ములుగు జిల్లా : ఏటూరునాగారం అడవుల్లో మావోయిస్టులు దాచి ఉంచుకున్న ఆయుధాల డంప్ను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఏటూరునాగారం మండలం దొడ్ల సమీపంలో అటవీ ప్రాంతంలో డంప్ ను గుర్తించిన పోలీసులు సురక్షిత పద్ధతులు పాటించి  స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్ లో 10 జిలిటన్ స్టిక్స్, 10 డితోనేటర్స్, 3 క్లైమోర్ మైన్స్, 5 కప్లింగ్స్, 33 ఎస్ఎల్ఆర్ లైవ్ రౌండ్స్, 1 ఫైర్ ఐన రౌండ్ SLR , 1 ఫైర్ ఐన రౌండ్ AK-47,బ్యాటరీ, 1 వైర్ బెండల్, 2కిలోల మేకులు దొరికాయని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపారు.