ములుగు జిల్లాలో ముగ్గురు దొంగలు అరెస్ట్..రూ. 16 లక్షల సొత్తు రికవరీ

ములుగు జిల్లాలో ముగ్గురు దొంగలు అరెస్ట్..రూ. 16 లక్షల సొత్తు రికవరీ
  •     ములుగు డీఎస్పీ రవీందర్ వెల్లడి 

వెంకటాపూర్/ గోవిందరావుపేట, వెలుగు : ములుగు జిల్లాలో చోరీ కేసును పోలీసులు చేధించి సొత్తును రికవరీ చేశారు.  డీఎస్పీ ఎన్​.రవీందర్​సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్​ గ్రామానికి చెందిన పుల్యాల రజిని గత శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి సమీపంలోని తల్లిగారి ఇంటికి వెళ్లి నిద్రపోయి, మరుసటి రోజు తెల్లారి ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగింది. 

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ దయాకర్​ దర్యాప్తు చేపట్టి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఇందుకు క్లూస్​టీమ్ గ్రామస్తుల సాయంతో దొంగలను గుర్తించి  అదుపులోకి తీసుకుని 12తులాల బంగారం, రూ.2.10లక్షల నగదు, 2 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ  రూ.12లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. 

బుస్సాపూర్​గ్రామానికి చెందిన కుక్కల రాజు, కండెల పద్మ, పెరుమాండ్ల భాగ్యలక్ష్మి ఆర్థిక ఇబ్బందులతోనే చోరీకి పాల్పడినట్లు తేల్చారు. కేసు చేధించిన పస్రా సీఐ దయాకర్, ఎస్ఐ కమలాకర్​, సీసీఎస్, క్లూస్​ టీమ్ సిబ్బందిని ఎస్పీ శబరీశ్, డీఎస్పీ రవీందర్ అభినందించారు.