యువత మత్తుకు దూరంగా ఉండాలి : పోలీస్ ఉన్నతాధికారులు

యువత మత్తుకు దూరంగా ఉండాలి : పోలీస్ ఉన్నతాధికారులు

వెలుగు, నెట్​వర్క్​:  యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని పోలీస్​ ఉన్నతాధికారులు అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని పలుచోట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన– ప్రగతి నివేదన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఈగల్​ ఫోర్స్​ఆఫీసర్స్​అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఈగల్​ ఫోర్స్​ ఎస్పీ సీతారామ్​ఆధ్వర్యంలో అవగాహన కల్పించగా, అంతకుముందు విద్యార్థులతో కలిసి డ్రగ్స్​కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రం, వంగపహాడ్​ ప్రభుత్వ పాఠశాలలో ఈగల్​ ఫోర్స్​ డీఎస్పీ నర్సింహారావు డ్రగ్స్​పై అవగాహన కల్పించారు. ​ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్మెల్ స్కూల్​లో ఈగల్​ టీం డీఎస్పీ పుష్పక్​ కుమార్ ఏసీపీ పింగిళి ప్రశాంత్​రెడ్డితో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్, గట్లనర్సింగాపూర్​లో ఇన్​స్పెక్టర్​ రాము మాట్లాడుతూ విద్యార్థులకు డ్రగ్స్​కు దూరంగా ఉండాలని సూచించారు.​

వరంగల్​ జిల్లా పర్వతగిరిలో ఈగల్​టీం డీఎస్పీ శంకర్​ఆధ్వర్యంలో స్టూడెంట్లతో కలిసి ర్యాలీ నిర్వహించగా, చింతనెక్కొండలో పర్వతగిరి సీఐ రాజగోపాల్​ పాల్గొని మాట్లాడారు. గీసుగొండ మండలం ధర్మారం స్కూల్​లో ఈగల్​ టీం డీఎస్పీ రమేశ్​ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సంగెం మండలం ఆశాలపల్లిలో ఎస్సై వంశీకృష్ణ మాట్లాడారు. నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో విద్యార్థులు, లీడర్లతో కలిసి ఈగల్​ ఫోర్స్​ డీఎస్పీ భిక్షపతిరావు ర్యాలీలు నిర్వహించారు.