సీఎం కేసీఆర్ పై సీతక్క ఫైర్

సీఎం కేసీఆర్ పై సీతక్క ఫైర్

భైంసా, వెలుగు : బాసరకు వస్తే ఓడిపోతానన్న భయంతోనే ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్​ ఇక్కడికి  రాలేదని  ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. బాసర సరస్వతీ ఆలయాన్ని టీఆర్​ఎస్​ సర్కారు అభివృద్ధి చేయడంలేదని  ఫైర్​ అయ్యారు. సోమవారం ఆమె అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకపూజలు చేశారు. వేద పండితులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ..  ఆలయంలో సౌకర్యాలు లేవని, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  దేవాదాయ శాఖ  మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి సొంత జిల్లాలో ఉన్న ఈ గుడిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు బాసరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్​ నాయకులు సీతక్కను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు  ఆనంద్​ రావు పటేల్, సాయినాథ్​, రమేశ్​ పాల్గొన్నారు.