ములుగు/ తాడ్వాయి, వెలుగు: ములుగు మండలం మల్లంపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కెనాల్పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు త్వరగా పూర్తయితే మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ప్రస్తుతం ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్వెల్లడించారు.
సోమవారం బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎస్పీ ఎన్హెచ్ డీఈ కిరణ్ కుమార్, ఏఈ చేతన్ తో పనులపై చర్చించారు. మేడారం జాతరకు ప్రధాన మార్గమైన హనుమకొండ ములుగు రూట్ లో బ్రిడ్జి వద్ద వాహనాలకు అంతరాయం కలుగుతుందని, సకాలంలో పూర్తిచేయాలని ఎన్హెచ్ అధికారులను కోరారు. అనంతరం ఆయన మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. క్యూలైన్ గ్రిల్స్ పనులను నాణ్యతతో పూర్తి చేయాలనిసూచించారు.
అధికారుల సూచనలు అర్థం చేసుకోవాలి..
మేడారంలో చిరు వ్యాపారులు అధికారుల సూచనలను అర్థం చేసుకుని, సహకరించాలని కలెక్టర్ దివాకర్, ఎస్పీ రామ్నాథ్ కేకన్ కోరారు. మేడారం మహా జాతర సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులు భక్తుల రద్దీ దృష్ట్యా రోడ్డుకు 12 అడుగుల దూరంలో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
