ఈ అమ్మాయిని చంపినోడు.. పోలీస్ స్టేషన్లో ఉరేసుకున్నాడు

ఈ అమ్మాయిని చంపినోడు.. పోలీస్ స్టేషన్లో ఉరేసుకున్నాడు

ముంబై ఎయిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రేను హత్య చేసిన కేసులో ఆరెస్టైన 40 ఏళ్ల నిందితుడు విక్రమ్ అత్వాల్ 2023 సెప్టెంబర్ 08 శుక్రవారం రోజున అంధేరీ పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆత్మహత్య చేసుకోవడానికి అత్వాల్ తన ప్యాంట్‌ను ఉపయోగించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి పంపించారు.  

రూపా ఫ్లాట్‌లో విక్రమ్ అత్వాల్ క్లీనింగ్ పనులు చేస్తుంటాడు. అయితే తన ఫ్లాట్‌లో విధులు సరిగా నిర్వహించట్లేదని రూపా అతనిని ఇటీవల మందలించింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న విక్రమ్.. పక్కా ప్లాన్ చేసుకుని పదునైన ఆయుధంతో రూపా ఫ్లాట్‌కు వెళ్లాడు. ముందుగా ఆమెపై  అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ రూపా విక్రమ్‌ని నెట్టివేసి బయటకు పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. 

Also Read :- రోడ్డు పక్కన దిగిన హెలికాఫ్టర్.. షాక్ అయిన సిటీ జనం

అయితే విషయం ఎక్కడ బయటపడుతుందో అని విక్రమ్ అట్వాల్ ఆమె మెడను పదునైన ఆయుధంతో కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.  దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.  రూపా హత్య కేసులో బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాదాపు 45మందిని విచారించారు.  ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా..  ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఏప్రిల్‌లో ముంబైకి వచ్చింది.   రూపల్ చివరిసారిగా ఆదివారం ఉదయం తన కుటుంబంతో వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడింది.