ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గోరెగావ్ లోని ఓ భవనం ఆరో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 40మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంటల్లో చిక్కుకున్న 30 మందిని అధికారులు రక్షించామని బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు తెలిపారు. 

గోరెగావ్ వెస్ట్‌లోని ఎంజి రోడ్డు సమీపంలోని జై సందేశ్ బిల్డింగ్‌లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ముంబై సివిక్, పోలీసు , అగ్నిమాపక దళ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు చెలరేగిన భవనం గ్రౌండ్ ప్లస్ ఐదంతస్తులతో కూడుకున్నదని చెబుతున్నారు. ఇప్పటి వరకు అగ్ని ప్రమాదంలో గాయపడిన మొత్తం 46 మందిలో ఏడుగురు మరణించారు. 40మంది HBT , కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.