2023లో ఐపీఎల్ మ్యాచ్ లకు జట్లు తయారవుతున్నాయి. కొన్ని జట్లు కోచ్ లను నియమించుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు నూతన కోచ్ ను నియమించుకుంది. ‘మార్క్ బౌచర్ కు ముంబై ఇండియన్స్ స్వాగతం పలకడం ఆనందంగా ఉంది’ అంటూ ట్వీట్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది. జట్టుకు అనేక విజయాలు అందించే విధంగా కృషి చేస్తారని, ఆయనకున్న అపారమైన విలువలను జట్టు సభ్యులకు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మార్క్ బౌచర్ స్పందించారు. MI జట్టుకు ప్రధాన కోచ్ గా నియమించబడడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. సవాల్ కోసం ఎదురు చూస్తున్నట్లు, మంచి ఫలితాలు ఇచ్చేందుకు పని చేస్తానన్నారు.
బలమైన ఆటగాళ్లతో జట్టు ఉందన్నారు. T20 ప్రపంచకప్ 2022 ముగిసిన అనంతరం సౌతాఫ్రికా ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ జట్టుకు హెడ్ కోచ్ లుగా మహేలా జయవర్ధనే, జహీర్ ఖాన్ లున్నారు. జయవర్ధనే 2017 నుంచి ముంబై జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. 2019లో భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. వీరిద్దరికి కొత్త బాధ్యతలు అప్పగించింది. జయవర్ధనేకు గ్లోబల్ హెడ్ఆఫ్ ఫెర్మామెన్స్ పదవి, జహీర్ ఖాన్ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్మెంట్గా నియమించింది.
Presenting आपले नवीन Head Coach - ???? ??????? ?
— Mumbai Indians (@mipaltan) September 16, 2022
Paltan, drop a ? to welcome the ?? legend to our #OneFamily ?#DilKholKe #MumbaiIndians @markb46 @OfficialCSA pic.twitter.com/S6zarGJmNM
?????????? & ??? get their ? roles! ?
— Mumbai Indians (@mipaltan) September 14, 2022
Read more ?#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @MahelaJay @ImZaheer https://t.co/D0nUxLL0Aa