
ముంబై ఇండియన్స్ గెలుపు బాట పట్టింది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. వాంఖడే స్టేడియంలో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై కేకేఆర్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసింది. వెంకటేష్ అయ్యార్ విశ్వరూంపం చూపిస్తూ సెంచరీ బాదడంతో కోల్ కతా 185 పరుగులు చేసింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. సూపర్ ఓవర్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (20, 13 బంతుల్లో), ఇషాన్ కిషన్ (58, 25 బంతుల్లో) చితకొట్టారు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై ఒక వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది.
వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. తిలక్ వర్మ (30, 25 బంతుల్లో), టిమ్ డేవిడ్ (23, 12 బంతుల్లో) రాణించడంతో 186 పరుగుల లక్ష్యాన్ని ముంబై సునాయసంగా చేదించింది. కోల్ కత్తా బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ దక్కించుకున్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీంలో వెంకటేష్ అయ్యర్ మినహా మిగతా బ్యాట్స్ మెన్ అంతా ఫెయిల్ అయ్యారు. వెంకటేష్ అయ్యార్ విశ్వరూపం చూపించాడు. తన ధనాధన్ ఇన్నింగ్స్ తో ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు ఫోర్లతో విరుచుకుడి కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో కోల్ కత్తా 185 పరుగుల భారీ స్కోరు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన కోల్ కతాకు చేదు అనుభవం ఎదురైంది. ఓపెనర్లు రెహ్మానుల్లా (8, 12 బంతుల్లో), జగదీషన్ (0, 5 బంతుల్లో) విఫలం అయ్యారు. మొదటి వికెట్లో వచ్చిన వెంకటేష్ అయ్యార్ (104, 51 బంతుల్లో) ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సర్లు ఫోర్లు బాదుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కేకేఆర్ బ్యాటర్లలో ఏ ఒక్క బ్యాట్స్ మెన్ క్రీజులో వెంకటేష్ అయ్యర్ కు తోడు నిలవలేకపోయారు. షార్దూల్ ఠాకూర్ (13, 11 బంతుల్లో), రింకు సింగ్ (18, 18 బంతుల్లో) అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. చివర్లో రస్సెల్ (21,11 బంతుల్లో) చెలరేగడంతో కోల్ కతా 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హ్రితిక్ శోకీన్ 3 వికెట్లు దక్కాయి. గ్రీన్, జాన్సన్, పియూష్ చావ్లా, మెరిడిత్ కు చెరో వికెట్ పడగొట్టారు.