ఐపీఎల్ 16వ సీజన్లో మరో కీలకమైన పోరుకు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. వాంఖడే స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్తో తలపడుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడి రెండింటిలో గెలిచింది. ఒక దాంట్లో ఓడింది. అటు నితీశ్ రాణా నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ నాలుగు మ్యాచుల్లో రెండు గెలిచి..రెండింటిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రెండు జట్లు గెలుపే టార్గెట్గా బరిలోకి దిగాయి.
ముంబై ఇండియన్స్ తుది జట్టు: ఇషాన్ కిషన్ (WK), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, నేహాల్ వధేరా, హృతీక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, పీయూష్ చావ్లా, రిలె మెర్డిత్, డువాన్ జాసన్ .
కోల్ కతా నైట్ రైడర్స్ తుది జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (WK), వెంకటేష్ అయ్యర్, ఎన్ జగదీసన్, నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.