ముంబైలో వినాయక దర్శనం ఆన్‌లైన్‌లోనే

ముంబైలో వినాయక దర్శనం ఆన్‌లైన్‌లోనే

వినాయక చవితి ఉత్సవాలు రేపు(శుక్రవారం) ప్రారంభమవుతున్న క్రమంలో ముంబైలో కఠిన ఆంక్షలకు సిద్ధమైంది అక్కడి స్థానిక ప్రభుత్వం. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ముంబైలో 144 సెక్షన్ అమలులో ఉండనున్నట్లు ముంబై పోలీసు కమిషనరేట్ తెలిపింది. దీంతో ఎవరూ వినాయక ఉత్సవ ఉరేగింపులు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఒక ప్రదేశంలో ఐదుగురికి మించి ఎక్కువ మంది గుమి కూడవద్దని ముంబై పోలీసులు తెలిపారు. వినాయక మండపాల్లోకి ప్రత్యక్ష దర్శనం అనుమతి లేదని, ఆన్‌లైన్‌లోనే దర్శించుకోవాలని చెప్పారు. ఇది ముంబై పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలులో ఉంటుందని తెలిపారు పోలీసులు.