ముంబైలోని ప్రముఖ యోగా ఇన్స్టిట్యూట్లలో ఒకటైన మెరైన్ డ్రైవ్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్.. కైవల్యధామానికి 100 సంవత్సరాల గుర్తుగా రూ.100 స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. 1924 నుంచి కైవల్యధామ యోగాను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి, విజ్ఞాన శాస్త్రాన్ని మిళితం చేసే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ కార్యక్రమానికి బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Also Read :- AIలోకి ఎలన్ మస్క్ వచ్చేశాడు
“యోగం కేవలం అభ్యాసానికి మించినదే కాదు.. ఇది వ్యక్తులు, సమాజంలోని సానుకూల పరివర్తనలను ఉత్ప్రేరకపరచగల జీవన విధానానికి సంబంధించింది. కైవల్యధామ అచంచలమైన, శతాబ్దాల పాటు చేసిన ప్రయత్నం, అంకితభావం నిజంగా అభినందనీయం. ఈ వేడుకలో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. ఈ స్మారక నాణెం శాస్త్రీయ పరిశోధనల మద్దతుతో యోగాను ప్రోత్సహించడంలో కైవల్యధామ చేసిన ముఖ్యమైన సహకారానికి నిదర్శనం" అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.