సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం విశ్వనాథ్ బతికే ఉంటారు : మురళీ మోహన్

సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం విశ్వనాథ్  బతికే ఉంటారు : మురళీ మోహన్

సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం దివంగత దర్శకులు  కే విశ్వనాథ్  బతికే ఉంటారని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు. పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన 'కళాతపస్వికి కళాంజలి' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ తో తనకున్న అనుబంధాన్ని మురళీ మోహన్  గుర్తుచేసుకున్నారు. ఇండియన్ కల్చర్ను  ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తి  విశ్వనాథ్ అని కొనియాడారు. సంగీతానికి,సాహిత్యానికి విశ్వనాథ్ తన సినిమాలో పెద్దపీట వేశారని చెప్పారు. 

విశ్వనాథ్ శంకరాభరణం చిత్రాన్ని  తీసే టైమ్ లో అందరు అనుమానపడ్డారని.. అందులో తాను ఒకడినన్నారు. కానీ ఆ చిత్రం ఘన విజయాన్ని అందుకుందన్నారు. విశ్వనాథ్ తెరకెక్కించిన సూత్రధారులు చిత్రంలో తాను నటించానని చెప్పిన మురళీ మోహన్...ప్రతి పాత్రను ఆయన దగ్గరుండి చూస్తారని తెలిపారు.  నీ పాదం మీద పుట్టమచ్చనై చెల్లమ్మ పాట విశ్వనాథ్ కు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ పాటకు నంది అవార్డు తీసుకునే సమయంలో నారాయణమూర్తిని విశ్వనాథ్ అభినందించారని మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. ఎవరు బాగా పనిచేసిన అభినందించే అలవాటు ఆయనకు ఉందని చెప్పారు.