బీఆర్ఎస్ కు జడ్పీటీసీ రిజైన్.. అదేబాటలో కొందరు సర్పంచులు

బీఆర్ఎస్ కు జడ్పీటీసీ రిజైన్.. అదేబాటలో కొందరు సర్పంచులు

సిరిసిల్ల: బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్​కు తన సొంత నియోజకవర్గంల సిరిసిల్లలో షాక్​ తగిలింది. ముస్తాబాద్ జడ్పీటీసి గుండం నర్సయ్య బీఆర్ఎస్ పార్టీ కి  రాజీనామా చేశారు. ఆయనబాటలోనే మరి కొంత మంది సర్పంచులు, 8 మంది మాజీ సర్పంచులు, 60 మందికిపైగా మాజీ వార్డు మెంబర్లు, ఇంకా  80 నుంచి 100 దాకా లీడర్లు, కార్యకర్తలు పార్టీకి రిజైన్​చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  1000 మందిమి పార్టీమారుతున్నామన్నారు. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వీరంతా కాంగ్రెస్ లో చేరనున్నారు.