
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు క్వార్టర్లో మ్యూచువల్ ఫండ్స్ న్యూ ఫండ్స్ ఆఫర్స్(ఎన్ఎఫ్ఓ) వసూళ్లు నాలుగు రెట్లు పెరిగి రూ. 22,000 కోట్లకు చేరుకున్నాయి. మునుపటి క్వార్టర్తో పోలిస్తే 48 కొత్త పథకాలు మ్యూచువల్ ఫండ్ మార్కెట్లోకి వచ్చాయి. జూన్ క్వార్టర్లలో 25 ఎన్ఎఫ్ఓల ద్వారా రూ.5,539 కోట్లు వసూలయ్యాయి. రాబోయే క్వార్టర్లల్లో మరిన్ని ఎన్ఎఫ్ఓలు రావొచ్చని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి అన్నారు.
అనేక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ( ఏఎంసీలు) ఈక్విటీ, డెట్ ఇన్వెస్టర్లకు విభిన్నమైన ఉత్పత్తులను అందిస్తున్నాయని చెప్పారు. లిస్టెడ్ వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, ఏఎంసీలు ఈక్విటీ హైబ్రిడ్ కేటగిరీలలో మరిన్ని స్కీమ్లను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ప్రత్యేకించి మిడ్, స్మాల్, మైక్రో క్యాప్ విభాగంలోకి మరిన్ని ఎన్ఎఫ్ఓలు వస్తాయని వివరించారు.