మరోసారి టీచర్ల మ్యూచువల్ బదిలీలు

మరోసారి టీచర్ల మ్యూచువల్ బదిలీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి టీచర్లకు మ్యూచువల్ బదిలీలు జరిగాయి. దీనివల్ల మొత్తం 23 జిల్లాలకు చెందిన 98 మంది టీచర్లకు లబ్ధి చేకూరింది. మ్యూచువల్ బదిలీల ఉత్తర్వులను విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ వేర్వేరుగా జారీ చేశారు. కాగా.. బదిలీ అయిన టీచర్లు ఈ నెల 24న అకడమిక్ లాస్ట్ వర్కింగ్ రోజున జాయిన్ కావాలని సూచించారు.