టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్కు ఎన లేని క్రేజ్ ఉంటుంది. వారిలో నాగార్జున, టబు హిట్ పెయిర్గా పేరు పొందారు. వీరి కాంబోలో నిన్నేపెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, సిసింద్రీ చిత్రాలు అప్పట్లో సూపర్ హిట్గా నిలిచాయి. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ జోడీ కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నారు. నాగార్జున నటిస్తున్న 100వ చిత్రంలో టబు ఆన్ బోర్డ్ అయినట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే శరవేగంగా జరుగుతోన్న ఈ మూవీ షూటింగ్లో టబు జాయిన్ అయ్యినట్టు తెలియజేశారు.
వీరిద్దరి సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున స్టైలిష్ క్యారెక్టర్లో ఇంప్రెస్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కింగ్ 100, లాటరీ కింగ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

