‘అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను’

‘అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను’

రోజూ ఏదో ఒక అంశంపై గురించి ప్రస్తావిస్తూ హాట్ టాపిగ్గా మారుతున్నారు మెగాబ్రదర్ నాగబాబు.

మొన్నటి మొన్న జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేకు దేశభక్తుడిగా కీర్తించి, వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు . అయితే ఆ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాను చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అర్ధం చేసుకోవద్దని నాగబాబు వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యల్ని మరిచిపోక ముందే మంత్రి అవంతి శ్రీనివాస్ పై సెటైర్లు వేశాడు ఈ మెగా బ్రదర్ .

ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువులు వెలువడిన అనంతరం అక్కడి పరిస్థితులను చక్కబెట్టేలా ప్రజాప్రతినిధులు అక్కడ పల్లెనిద్ర చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. జగన్ ఆదేశాలతో అక్కడ నిద్ర చేసిన అవంతి శ్రీనివాస్..మరోసటి రోజు ఆ గ్రామంలో మూగజీవాలకు  గడ్డి వేస్తూ కనిపించారు.

ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలపై స్పందించిన నాగబాబు ..శ్రీనివాస్ పశువులకు గడ్డి వేస్తున్న ఫొటోను పోస్ట్ చేసి ‘అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను..’ అని కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్లపై వైసీపీ నేతలు విమర్శ చేయగా..ప్రజారాజ్యం పార్టీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజు వైసీపీ లో చేరి మంత్రి అయ్యారంటూ నాగబాబు అభిమానులు గుర్తు చేస్తున్నారు.