కాంగ్రెస్ శ్రేణులతో నాగం ఆత్మీయ సమ్మేళనం

కాంగ్రెస్ శ్రేణులతో నాగం ఆత్మీయ సమ్మేళనం

నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్​ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో నాగం జానార్థన్​రెడ్డి సమావేశమయ్యారు. తన భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య కార్యకర్తలతో చర్చించారు. హెలికాప్టర్ లో వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారని కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు నాగం జనార్థన్ రెడ్డి. 

కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఆరోపించారు నాగం. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపల్ కేంద్రంలోని అరుణ కన్వెన్షన్ హల్ లో నాగం జనార్థన్ రెడ్డి కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాగర్ కర్నూల్, గిజినేపల్లి, తిమ్మాజీపేట, తడుర్, టేలెక్కపల్లి మండలాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.