
- జెండా ఊపి ప్రారంభించనున్న
- కేంద్ర మంత్రి బండి సంజయ్,
- మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల, వెలుగు: నాగ్పూర్ – -సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ కల్పిస్తూ ఇటీవల రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ట్రెయిన్ సోమవారం నుంచి మంచిర్యాల స్టేషన్లో ఆగుతుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం ఉదయం 8.15 గంటలకు మంచిర్యాలలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైల్వేశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు.