పాక్ తో మ్యాచ్ అంటే భారత్ కి భయమా..? మాజీ పీసీబీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

పాక్ తో మ్యాచ్ అంటే భారత్ కి భయమా..? మాజీ పీసీబీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

ఆసియా కప్ లో భాగంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన భారత్ పాకిస్థాన్ మ్యాచ్ కి వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే జరిగిన ఈ మ్యాచులో భారత్ గౌరవ ప్రథమమైన స్కోర్ చేయగా.. పాక్ బౌలర్లు పర్వాలేదనిపించారు. అంతేకాదు మిగిలిన మ్యాచులకి కూడా వర్షం ముప్పు ఉంది. దీంతో శ్రీలంకలోని కొలొంబోలో జరిగే మ్యాచులన్నీ వేరే వేదికకు మార్చాలని కొందరు సూచించినా ఈ విషయంపై ఏసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ చైర్మన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు "  కొలంబోలో రానున్న కొన్ని రోజులపాటు భారీ వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉంది. అయినా సరే ఆసియా కప్ మ్యాచులను వేరే చోటకు మార్చకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని సేథ్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా బీసీసీఐని టార్గెట్ చేస్తూ పాక్ చేతిలో ఓడిపోతామని భయంతో ఈ మ్యాచ్ కూడా వర్షార్పణం చేయాలని అనుకుంటున్నారా? అంటూ చురకలంటిచ్చాడు.
  
ఇప్పటికే భారత్ పాక్ మ్యాచ్ ని కొలొంబోలో కాకుండా హంబంతోటకు మార్చినట్లుగా పాక్ కి సమాచారం అందిందని.. అయితే ఇది జరిగిన గంటలోపే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరల కొలొంబోనే వేదికగా ఫిక్స్ చేశారని మండిపడ్డాడు. అసలేం జరుగుతోంది? పాక్ చేతిలో ఇండియా ఓడిపోతానని భయపడుతోందా?' అంటూ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు పెట్టాడు నజీమ్ సేథ్.