ప్రభాకర్ రావును 26న హాజరుపరచండి

ప్రభాకర్ రావును 26న హాజరుపరచండి

 

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్  కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్  ప్రభాకర్ రావును ఈ నెల 26న కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. నాన్ బెయిలబుల్   వారంట్  ఉన్నందున అరెస్టు చేసి  తీసుకురావాలని సూచించింది.

ఇప్పటికే అరెస్ట్  అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు జ్యుడీషియల్  కస్టడీని ఈ నెల 26 వరకు పొడిగించింది. ఈ కేసులో ప్రభాకర్ రావు, ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై ఇప్పటికే లుక్ ఔట్ సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉండడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు.