
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు పలు బ్రాండ్లకు ప్రమోటర్ గానూ వ్యవహరిస్తూ బిజీబిజీగా ఉంటారు. దాంతో పాటు సక్సస్ ఫుల్ బిజినెస్ మెన్గా కూడా దూసుకుపోతున్నారు. మహేష్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సతీమణి నమ్రతా బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఏసియన్ గ్రూప్తో కలిసి బంజారాహిల్స్లో మరో కొత్త రెస్టారెంట్ ప్యాలెస్ హైట్స్ను గ్రాండ్గా ప్రారంభించారు. నమ్రతా శిరోద్కర్ జ్యోతిని వెలిగించి రెస్టారెంట్ను ప్రారంభించారు. ఏసియన్ గ్రూప్, మినర్వా గ్రూప్కి చెందిన మినర్వా కాఫీ షాప్ కూడా ఇటివలే ప్రారంభమైంది. ప్యాలెస్ హైట్స్, మినర్వా కాఫీ షాప్’ రెండూ బంజారాహిల్స్లోనే ఉన్నాయి. లగ్జరీ వసతులతో, అద్భుతమైన ఇంటీరియర్తో రాయల్ డైనింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే విధంగా ప్యాలెస్ హైట్స్ను నిర్మించారు. ప్రస్తుతం ఏసియన్ నమ్రత పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.