
అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని భావిస్తారు భక్తులు. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయ శిల్పకళకు ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పురాతన ఆలయాల్లో సౌమ్యనాథ స్వామి ఆలయం ఒకటి. సౌమ్యనాథ స్వామి ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా సౌమ్యనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది టీటీడీ. ఈ మేరకు బుధవారం ( జూన్ 26 ) సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు, తాళ్లపాక శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీవోలు నటేష్ బాబు, ప్రశాంతి పాల్గొన్నారు.
ALSO READ | తిరుమల సమాచారం : జూలై నెలలో కొండపై శ్రీవారి ఉత్సవాలు ఇవే
జులై నెల 4 వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సావాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు. అలాగే.. జులై 4 నుంచి 15వ తేదీ వరకు శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్దేశ్వర స్వామివార్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఈ క్రమంలో ఆలయ విశిష్టతను చైర్మెన్ కు వివరించారు అధికారులు.
జూన్ 4 నుంచి 13వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు ఘనంగా చేస్తున్నామని.. వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజంతా తప్పక పాల్గొనాలని.. స్వామివారి కృపాకటాక్షాలు అందుకోవాలని తెలిపారు అధికారులు.