
రొటీన్ కు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో అమిగోస్ సినిమా చేశానని నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘అమిగోస్’ మూవీ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కల్యాణ్ రామ్ సినిమా గురించి పలు విషయాలు పంచుకున్నారు. మైత్రీ మూవీస్ తనకు హోమ్ బ్యానర్ వంటిదని ఆయన అన్నారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందన్నారు. ఒక దర్శకుడిగా రాజేంద్ర ఎంతగా కష్టపడ్డాడో తను చూశానని చెప్పారు. ఈ సినిమాను ఆయన పేరెంట్స్ కి అంకితం చేస్తున్నామని కల్యాణ్ రామ్ అన్నాడు.
రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మించారు. ఇందులో కల్యాణ్ రామ్ కు జోడీగా ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇందులో కల్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నాడు. బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాష్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ ఇతర పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చాడు.