పేదలకు వరం ఆయుష్మాన్ భారత్: నందీశ్వర్​ గౌడ్

పేదలకు వరం ఆయుష్మాన్ భారత్: నందీశ్వర్​ గౌడ్

పటాన్​చెరు, వెలుగు:  భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పేదలరకు ఒక వరమని పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​ గౌడ్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని 23వ వార్డు లో బీజేపీ నేత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో  600 మందికి ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డులను అందజేశారు.  

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదెల్లి  రవీందర్, కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, కో కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా,  అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆగా రెడ్డి, అనిల్ చారి,  శ్రవణ్ పాల్గొన్నారు.