నందిపేట బస్సు డిపో జాగాను వినియోగంలోకి తెస్తాం : పైడి రాకేశ్​​రెడ్డి

నందిపేట బస్సు డిపో జాగాను వినియోగంలోకి తెస్తాం : పైడి రాకేశ్​​రెడ్డి

నందిపేట, వెలుగు: నందిపేట మండల కేంద్రంలో బస్సు డిపో కోసం స్థలాన్ని వినియోగంలోకి  తీసుకువస్తానని ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​​రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన బస్టాండ్ సమీపంలో ఉన్న ఐదెకరాల బస్సు డిపో స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డిపో కోసం కొన్నేళ్ల క్రితం ఉమ్మడి నందిపేట మండల వాసులు చందాలు వేస్కొని ఈ స్థలాన్ని కొన్నారు.  

గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల నిరుపయోగంగా మారిందన్నారు. తాను అధికారులతో మాట్లాడారు. స్థలాన్ని వాడుకలోకి తెస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నందిపేట హైస్కూల్​, కస్తూరిబా స్కూళ్లను పరిశీలించారు. ఆయన వెంట పెద్దోళ్ల గంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్​ రాజు, నాయకులు లింగారెడ్డి, చిన్నారెడ్డి, రమేశ్​​ తదితరులు
 ఉన్నారు.