‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని, వంద కోట్ల క్లబ్లో చేరాడు నాని. ఈ హ్యాపీ మూమెంట్స్తో ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ కొత్త సినిమా రిలీజ్ డేట్ని శనివారం ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న సినిమాని విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ను పూర్తిచేయగా, రెండో షెడ్యూల్ గోవాలో జరుగుతోంది.
నలభై రోజులపాటు జరగనున్న లాంగ్ షెడ్యూల్తో దాదాపు షూట్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇది నానికి 30వ సినిమా. ఇంకా టైటిల్ రివీల్ చేయలేదు. తండ్రీకూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన వీడియో గ్లింప్స్లో చూపించారు. బేబి కైరా కూతురిగా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది.
మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మిస్తున్నారు. మలయాళ చిత్రం ‘హృదయం’ ఫేమ్ హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక వెంకటేష్ నటిస్తున్న ‘సైంధవ్’ కూడా ఒక్కరోజు తేడాతో విడుదల కానుండడంతో.. క్రిస్మస్ సీజన్లో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఉండబోతోంది.