సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత నారా లోకేష్ . ఏడు నెలలుగా జగన్ తవ్వుతుంది అవినీతి కాదని..వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని అన్నారు. అవినీతిపై ఆధారాలు చూపెట్టమంటే అవే పాత కాకి లెక్కలు చెబుతున్నారన్నారు. 4,075 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ ఆరోపిస్తున్నారన్నారు.
సబ్ కమిటీ నివేదికపై ఓపెన్ ఛాలెంజ్ అంటూ సవాల్ విసిరారు లోకేష్. అమరావతిలో జగన్ ఆరోపిస్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి తాము సిద్ధమన్నారు. అదే సమయంలో గత 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి జగన్ సిద్ధమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి కోసం రూ. 5 వేల కోట్లే ఖర్చు చేశారన్నారు. లక్ష కోట్లు కావాలంటూ వైసీపీ కొత్త పాట పాడుతుందన్నారు.
ఏడు నెలలుగా @ysjagan గారు తవ్వుతోంది అవినీతి కాదు వైకాపా ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి. ఆధారాలు బయటపెట్టమని అడుగుతుంటే జగన్ గారు అవే పాత కాకి లెక్కలు చెబుతున్నారు. 4,075 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు.(1/3)
— Lokesh Nara (@naralokesh) December 28, 2019