హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ కాలేజ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. అయ్యప్ప సొసైటీల వద్ద ప్రణవి క్యాంపస్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థి గంటా కనక రాజు (17) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆగస్టు 8న నారాయణ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ లో కనకరాజు చేరాడు. అయితే తాజాగా తను చదువుతున్న క్యాంపస్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని గమనించిన సిబ్బంది కనకరాజును చికిత్స నిమిత్తం మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.