అమ్మాయి కోసం నడిరోడ్డుపై కొట్టుకున్న స్టూడెంట్స్

అమ్మాయి కోసం నడిరోడ్డుపై కొట్టుకున్న స్టూడెంట్స్

ఒకే కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఓ అమ్మాయి కోసం గూండాలుగా మారారు. రెండు వర్గాలుగా విడిపోయి కాలేజీ గేటు ముందే కట్టుకున్నారు. ఈ పంచాయితీ కాస్త పోలీస్‌ స్టేషన్‌ కు చేరింది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అమ్మాయి కోసం...

విద్యార్థుల మధ్య జరిగిన గ్యాంగ్‌ వార్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతోంది. ఒకే అమ్మాయిని ఇద్దరు విద్యార్థులు ప్రేమించడంతో కాలేజీలో పెద్ద గొడవకు దారి తీసింది. దీంతో విద్యార్థులు రెండు గ్రూప్‌లుగా విడిపోయి.. కాలేజీ గేటు ముందు కొట్టుకున్నారు. ఈ ఘటన 2023 జూన్ 29న కేశవ్ మెమోరియల్ కాలేజీ దగ్గర జరిగింది. కాలేజీ స్టూడెంట్స్ సృష్టించిన బీభత్సం స్థానికులను భయాందోళలకు గురిచేసింది.

ఎంపీసీ సెకండియర్ చదువుతున్న ఓ అమ్మాయి మరొకరితో క్లోజ్‌గా ఉండటంతో ఆమె స్నేహితుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో అతడు.. ఆ విద్యార్థితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులంతా రెండు వర్గాలుగా విడిపోయాయి. ఆ తర్వాత కాలేజీ గేటు ముందు గొడవ పడి కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. గొడవ పడిని విద్యార్థులంతా మైనర్లుని పోలీసులు తెలిపారు.