మా మనసులు కలిసాయి.. త్వరలో పెళ్లి

మా మనసులు కలిసాయి.. త్వరలో పెళ్లి

సీనియర్ నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గతకొంత కాలంగా ఆయన నటి పవిత్రతో కలిసే ఉంటున్నాడు. ఇక తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు నరేష్. త్వరలోనే తాను, పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. ప్రస్తుతం నరేష్, పవిత్ర జంటగా మళ్ళి పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగా నరేష్ కీలక వ్యాఖ్యలు చేసాడు.. 

"నిజానికి పెళ్లి అనేది కచ్చితంగా అవసరం లేదు. చాలామంది ఇష్టం లేకపోయినా కేవలం సమాజం కోసం పెళ్లి అనే బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్ల కోసమే ఈ సినిమా. పెళ్లి అంటే తాళిబొట్టు, మెట్టెలు కాదు. అవి కేవలం సంకేతాలు మాత్రమే. పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం. నాకు పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ మా మనసులు కలిశాయి. అందుకే మేము కలిసి హ్యాపీగా ఉంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాం. దానికి మీ ఆశీస్సులు కావాలి. ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది ఇది నా బయోపిక్ అని అనుకుంటున్నారు. కానీ కాదు. ట్రైలర్ చూసి సినిమాని అంచనా వేయకండి. సినిమా చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు నరేష్. 

ఇక విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.