
ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేదు.. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ లో ఉద్యోగుల తొలగింపు సంచలనంగా మారింది. మ్యాగజైన్ లో రాసే మొత్తం 19 మంది కంటెంట్ రైటర్లను.. ఒకేసారి తొలగించింది కంపెనీ. ఆర్థిక మాంధ్యం.. పత్రికలు చదివే వాళ్లు ఎవరూ లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వైపు మ్యాగజైన్ ను తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.
మరి డిజిటల్ కు కూడా కంటెంట్ రైటర్లు కావాలి కదా అని ఉద్యోగులు ప్రశ్నిస్తే.. ఫ్రీలాన్స్ కింద నియామకం ఉంటుందని.. ఆర్టికల్ రాయండి.. డబ్బులు తీసుకోండి అని స్పష్టం చేస్తుంది. పర్మినెంట్ ఉద్యోగులు అంటూ ఎవరూ ఉండరని వెల్లడించింది కంపెనీ. ప్రపంచ వ్యాప్తంగా నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఎన్నో భాషల్లో పత్రిక వస్తుంది. పెరిగిన ప్రింటింగ్ ఖర్చులు, మార్కెట్ లో అమ్మకాలు భారీగా తగ్గిపోవటం వంటి కారణాలతో.. పత్రికలోనూ కంటెంట్ రైటర్స్ అందరినీ తొలగించింది కంపెనీ.
ఈ సందర్భంగా తొలగించబడిన కొంతమంది కంటెంట్ రైటర్స్, నేషనల్ జియోగ్రాఫిక్తో పనిచేసిన వారి అనుభవాన్ని పంచుకున్నారు. "నేను చాలా అదృష్టవంతుడిని. ఇన్క్రెడిబుల్ జర్నలిస్టులతో కలిసి పనిచేయడం అనేది నాకు చాలా గొప్ప విషయం. ముఖ్యమైన, ప్రపంచ కథలను చెప్పే అవకాశం నాకు లభించింది. ఇది ఒక గౌరవం" అని క్రెయిగ్ వెల్చ్ ట్వీట్లో పేర్కొన్నారు. " ఐదేళ్లు పనిచేసినందుకు గౌరవంగా, ఆనందంగా ఉంది. చాలా గర్వంగా కూడా ఉంది" తొలగించబడిన స్టాఫ్ రైటర్లలో ఒకరైన డగ్లస్ మెయిన్ రాసుకొచ్చారు. ఫోటోగ్రాఫర్లు నాట్జియో మ్యాగజైన్లో కవర్పై, లోపల చేసిన చిత్రాలను క్యాప్చర్ చేయడానికి ఫీల్డ్లో పని చేసేవారు. అయితే ఫోటో కాంట్రాక్టులు కూడా గణనీయంగా తగ్గిపోయాయని సిబ్బంది తెలిపారు.
ప్రపంచంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఇన్నాళ్లు ఐటీ రంగం వరకే పరిమితం అయిన లేఆఫ్స్ ఇప్పుడు పత్రికలు, పేపర్లు, మ్యాగజైన్స్ వరకు రావటం అనేది.. జర్నలిస్టులను జీర్ఱించుకోలేకుండా చేస్తుంది.