బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : దుండ్ర కుమారస్వామి

బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : దుండ్ర కుమారస్వామి
  •     సీఎం రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ విజ్ఞప్తి

బషీర్ బాగ్, వెలుగు :  మేనిఫెస్టోలో  బీసీలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కోరారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్​లో  సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతానికి రిజర్వేషన్లు పెంచాలని, ఉపకులాల వారీగా రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. సంచార కులాలకు ప్రత్యేకంగా 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

వివిధ బీసీ కులాలకు ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్ల ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా బీసీలకు మేలు చేసేలా ఉండాల న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కుల గణనను నిర్వహించి..వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీలను నెరవేరిస్తే బీసీలకు మేలు జరుగుతుందని కుమారస్వామి పేర్కొన్నారు.