కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్పు చెప్పిన ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్పు చెప్పిన ఎన్జీటీ

పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు గుర్తించామన్న ఎన్జీటీ

ప్రాజెక్టు పూర్తయినందున ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది-ఎన్జీటీ

న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని గుర్తించామని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు పూర్తైయినందును ఇప్పుడు ఉపశమన చర్యల తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.. సరైన పర్యావరణ ప్రభావ మదింపు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ఎన్జీటీ తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, పర్యావరణ అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్జీటీ తేల్చిచెప్పింది. 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణానికి జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావసం అంశాలను కూడా అధ్యయనం చేయాలని.. నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని.. తర్వాత నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేయాలని కమిటీకి ఆదేశాలిచ్చింది. కమిటీ పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి పర్యవేక్షించాలని.. ప్రాజెక్టు విస్తరణపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని ఆదేశించింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్ లో చెప్పినట్లు డీపీఆర్ లు సమర్పించాక కేంద్రం నిర్ణయం తీసుకన్నాక ముందుకెళ్లొచ్చని సూచించింది. అలాగే ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది.