న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా దేశంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రామ్ను వాయిదా వేయలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలియో చుక్కల పంపిణీని వాయిదా వేస్తున్నారా అని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పోలియో కార్యక్రమాన్ని రీషెడ్యూల్ చేశామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది. ఈ నెల 31వ తేదీకి ప్రోగ్రామ్ను రీషెడ్యూల్ చేశామని స్పష్టం చేసింది. జనవరి 30న రాష్ట్రపతి భవన్లో పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ పోలియో నేషనల్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారని పేర్కొంది.
Madam,
The #polio National Immunization Day has NOT been postponed.
It has merely been RESCHEDULED to 31st January 2021. https://t.co/JW76vjqoLt pic.twitter.com/2GSaCG9S4D
— Ministry of Health (@MoHFW_INDIA) January 14, 2021