కామారెడ్డిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

కామారెడ్డిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

కామారెడ్డి, వెలుగు: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కామారెడ్డి ఆతిథ్యమివ్వనుంది. ఎస్​జీఎఫ్​(స్కూల్​గేమ్స్​ ఫెడరేషన్) ఆధ్వర్యంలో అండర్​–17 బాయ్స్​ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే టీమ్స్​ఈ నెల 6న రిపోర్ట్​ చేస్తాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో ఈ పోటీలను నిర్వహిస్తారు. 

ఏర్పాట్లపై ఆఫీసర్లు దృష్టి సారించారు. దేశంలోని 31 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు రానున్నారు. మొత్తం 650  మంది కబడ్డీ ఆటగాళ్లు పాల్గొంటారు. పోటీల నిర్వహణకు  పీఈటీలు, పీడీలు, విద్యా శాఖ, యూత్​ వెల్ఫేర్​శాఖ ఆధ్వర్యంలో కమిటీలు వేశారు. ఏర్పాట్లపై కలెక్టర్ ​జితేశ్ ​వీ పాటిల్​తో ఆఫీసర్లతో చర్చించారు. పోటీలకు వచ్చే క్రీడాకారులు, కోచ్​లు, టీమ్​ మేనేజర్లకు వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. 

స్థానిక మైనార్టీ రెసిడెన్షియల్​ స్కూల్, డెయిరీ కాలేజీలో క్రీడాకారులకు బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్, రైల్వే స్టేషన్లలో స్థానిక పీఈటీలతో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జనవరి 7న పోటీలు ప్రారంభమవుతాయి. పొద్దున ప్రారంభ వేడుకలు, కల్చరల్​ ప్రోగ్రామ్స్ ​నిర్వహిస్తారు. ముగింపు వేడుకలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులను ఆహ్వానించనున్నారు.