
చలాన్లు పెండింగ్లో ఉన్న వాహనదారులకు గుడ్ న్యూ్స్. మీ వాహనాలపై పెండింగ్ చలాన్లు కట్టక్కరలేదు. ఎంత ఉన్నా సరే..వాటన్నింటిని రద్దు చేయబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు. భారీగా పేరుకుపోయిన పెండింగ్ చలాన్ల సమస్యను పరిష్కరించేందుకు అక్టోబర్ 8న జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. అయితే ఇది మన హైదరాబాద్లో మాత్రం కాదు..దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో అక్టోబర్ 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరగనుంది.ఈ లోక్ అదాలత్లో కమర్షియల్, ప్రైవేటు వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు క్లియర్ చేయబడతాయి.
చలాన్లు క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి..
ఢిల్లీ వాసులు తమ వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లు క్లియర్ చేసుకోవాలని జాతీయ లోక్ అదాలత్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందుకోసం ఢిల్లీ హైకోర్టు, రూస్ అవెన్యూ కోర్టు, పాటియాల హౌస్ కోర్టు, తీస్ హజారీ కోర్టు, ద్వారకా కోర్టులు, సాకేత్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది.
అక్టోబర్ 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ 170 లోక్ అదాలత్ బెంచ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఒక్కో బెంచ్ వెయ్యి చలాన్ల కేసులను పరిష్కరించనుంది. జూన్ 30 2023 వరకు పేరుకుపోయిన మొత్తం లక్షా 70 వేల చలాన్ కేసులను పరిష్కరించడం లక్ష్యం.
జాతీయ లోక్ అదాలత్ లో పాల్గొనడానికి వాహనదారులు ముందుగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. delhipolice.gov.in/notice/lokadalat నుంచి వారి చలాన్ స్లిప్ లను పొందవచ్చు.
చలాన్ను సెటిల్ చేయడానికి ఏమి చేయాలంటే..
- వ్యక్తిగతంగా లేదా మీ చట్టపరమైన ప్రతినిధి ద్వారా మీ చలాన్ స్లిప్ను పొందిన తర్వాత ఈవెంట్ రోజున మీకు నచ్చిన కోర్టును సందర్శించండి.
- మీ చలాన్ల పరిష్కారం కోసం సంబంధిత లోక్ అదాలత్ న్యాయమూర్తికి చలాన్ స్లిప్ను సమర్పించండి.
- చలాన్ స్లిప్లో కోర్ట్ కాంప్లెక్స్, కోర్ట్ నంబర్, లోక్ అదాలత్ సమయం వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది, ఇక్కడ మీ చలాన్ పరిష్కరించబడుతుంది.
- కోర్టు ఆవరణలో ఎలాంటి ప్రింటింగ్ సౌకర్యాలు ఉండవు కాబట్టి, ముందుగా స్లిప్ను ప్రింట్ తీసుకుని వెళ్లడం తప్పనిసరి.